విజయం ముంగిట పాకిస్థాన్
అబుదాబి: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ విజయం ఇక లాంఛనమే కానుంది. 480 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (49 బంతుల్లో 39; 7 ఫోర్లు) ఒక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే విజయానికి ఇంకా 306 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిలో అద్భుతం జరిగితే తప్ప పాక్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు.
ఎడమ చేతి పేసర్ రాహత్ అలీ, జుల్ఫికర్ బాబర్, యాసిర్ షాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు పాక్ తమ రెండో ఇన్నింగ్స్ను 39.2 ఓవర్లలో రెండు వికెట్లకు 175 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (130 బంతుల్లో 101; 12 ఫోర్లు; 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. సోధికి రెండు వికెట్లు పడ్డాయి.