భవానికి రజతం
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ ఫెన్సర్ చదలవాడ భవానీ దేవి మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకుంది. బెల్జియంలో జరిగిన ఫ్లెమిష్ ఓపెన్ టోర్నమెంట్లో ఈ చెన్నై అమ్మాయి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల సాబ్రే ఈవెంట్లో పోటీపడిన భవాని ఫైనల్లో ఓటమి చవిచూసింది. తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకొని రాబోయే టోర్నీల్లో స్వర్ణం సాధించేందుక కృషి చేస్తానని భవాని వ్యాఖ్యానించింది.