ఎఫ్సీ గోవాకు రూ.11 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫ్రాంచైజీ ఎఫ్సీ గోవా జట్టుపై రూ.11 కోట్ల భారీ జరిమానా విధించారు. అంతేకాకుండా జట్టు సహ యజమానులు శ్రీనివాస్ డెంపోపై రెండు, ద త్తరాజ్ సాల్గావ్కర్పై మూడు సీజన్ల పాటు నిషేధాన్ని విధించారు. గత డిసెంబర్లో జరిగిన ఫైనల్ అనంతరం చెన్నైయిన్ ఎఫ్సీ ఆటగాడు ఎలనో బ్లూమర్తో గోవా అధికారుల స్వల్ప ఘర్షణ, ఇతర క్రమశిక్షణారాహిత్య ఘటనలతో ఐఎస్ఎల్ రెగ్యులేటరీ కమిషన్ ఈ కఠిన చర్య తీసుకుంది.