వైరల్‌: ధోని పాదాలను ముద్దాడిన అభిమాని

Fan Touches Head At MS Dhonis feet - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. తమ అభిమాన క్రికెటర్‌పై తమకున్న ప్రేమను ధోని అభిమానులు చాలా సందర్భాల్లో చాటుకున్నారు.  ఎన్నో అద్భుత ప్రదర్శనలతో ఈ జార్ఖండ్‌ బ్యాట్స్‌మన్‌ అభిమానుల మనసులను దోచుకున్నాడు. అందుకే మైదానంలో ధోని ఏం చేసినా అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతాయి. 

ఇటీవల లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఓ లిటిల్‌ అభిమాని నుంచి ఊహించని సంఘటన ఎదురైంది. ధోని చేతుల మీదుగా బహుమతి అందుకోవడానికి వేదికపైకి వచ్చిన ఆ అభిమాని వస్తూ వస్తూనే ధోని కాళ్ల మీద పడుతూ.. పాదాలను ముద్దాడాడు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికిలోనయ్యారు. వెంటనే ధోని అతన్ని పైకి లేపి కౌగిలించుకొని మరీ ఓ సెల్ఫీ దిగాడు. అంతేగాకుండా ఓ చిన్న బ్యాట్‌ను బహుమతిగా అందజేశాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన ఆరాధ్యదైవమైన ధోని తన ముందుండటంతో ఆ బుడ్డోడు మరోసారి పాదాభివందనం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక గతంలో మ్యాచ్‌ జరుగుతుంటే కొంత మంది అభిమానులు ధోనికి ఇలా పాదాభివందనం చేసిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top