కోహ్లి లేకపోతే అంతేనా..?

Entire team holidaying with Kohli, Fans furious as India crash to 92 all out - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా ఘోర ఓటమి చెందడం పట్ల నెటిజన్లు విమర్శలను ఎక్కుపెట్టారు. భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి లేకుండా ఆడితే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అంటూ మండిపడుతున్నారు. కివీస్‌తో మూడు వన్డేల తర్వాత కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో టీమిండియా తాజా ఓటమిని ఏ రకంగా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కోహ్లితో పాటు మొత్తం జట్టంతా ‘హాలీడే’ ప్రకటించినట్లు కనబడుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఇంతటి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంటే కోహ్లి లేని భారత జట్టును నమ్మడం ఎలా అని నిలదీస్తున‍్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్‌ చిత్తు చిత్తుగా ఓడింది. న్యూజిలాండ్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వని భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 93 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగా, కివీస్‌ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  ఈ స్వల్ప స్కోరు ఛేదనలో నికోలస్‌(30 నాటౌట్‌), రాస్‌ టేలర్‌(37 నాటౌట్‌)లు రాణించారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ధావన్‌(13),పాండ్యా(16) చహల్‌(18 నాటౌట్‌), కుల్దీప్‌(15)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top