శిఖర్‌ ధావన్‌ జోరు

Dhawan gets another fifty against south africa - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన జోరును కొనసాగిస్తున్నాడు. సఫారీలతో జరిగిన గత రెండు వన్డేల్లో అర్ధ శతకాలు సాధించిన శిఖర్‌.. నాల్గో వన్డేలో కూడా హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.  53 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో అర్ద శతకం సాధించాడు.  దాంతో భారత జట్టు 18.2 ఓవర్లలో 97 పరుగులు చేసింది. ఇది శిఖర్‌కు 26వ వన్డే హాఫ్‌ సెంచరీ.

ఈ రోజు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. దాంతో టీమిండియా బ్యాటింగ్‌ను రోహిత్‌ శర్మ, ధావన్‌లు ఆరంభించారు. అయితే రోహిత్‌ శర్మ(5) మరొకసారి నిరాశపరిచాడు. ఆ తరుణంలో ధావన్‌-కోహ్లిల జోడి స్కోరును ముందుకు తీసుకెళుతున్నారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే శిఖర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. వరుసగా రెండు, మూడు వన్డేల్లో ధావన్ ‌(51 నాటౌట్‌, 76 పరుగులు) హాఫ్‌ సెంచరీలు సాధించాడు.తొలి వన్డేలో 35 పరుగులు చేసిన రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top