శిఖర్ ధావన్ జోరు
జోహన్నెస్బర్గ్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. సఫారీలతో జరిగిన గత రెండు వన్డేల్లో అర్ధ శతకాలు సాధించిన శిఖర్.. నాల్గో వన్డేలో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 53 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో అర్ద శతకం సాధించాడు. దాంతో భారత జట్టు 18.2 ఓవర్లలో 97 పరుగులు చేసింది. ఇది శిఖర్కు 26వ వన్డే హాఫ్ సెంచరీ.
ఈ రోజు మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దాంతో టీమిండియా బ్యాటింగ్ను రోహిత్ శర్మ, ధావన్లు ఆరంభించారు. అయితే రోహిత్ శర్మ(5) మరొకసారి నిరాశపరిచాడు. ఆ తరుణంలో ధావన్-కోహ్లిల జోడి స్కోరును ముందుకు తీసుకెళుతున్నారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే శిఖర్ హాఫ్ సెంచరీ సాధించాడు. వరుసగా రెండు, మూడు వన్డేల్లో ధావన్ (51 నాటౌట్, 76 పరుగులు) హాఫ్ సెంచరీలు సాధించాడు.తొలి వన్డేలో 35 పరుగులు చేసిన రనౌట్గా పెవిలియన్ చేరాడు.
మరిన్ని వార్తలు