సీఎస్కేతో మ్యాచ్: ఢిల్లీ బ్యాటింగ్
ఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లు తాము ఆడిన తొలి మ్యాచ్ల్లో గెలిచి శుభారంభం చేశాయి. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
ఢిల్లీ గెలుపులో రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించగా, చెన్నై గెలుపులో స్పిన్ త్రయం హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్, రవీంద్ర జడేలు ముఖ్య భూమిక పోషించారు. దాంతో ఇరు జట్ల మధ్య ఈరోజు జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో చెన్నై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ అమిత్ మిశ్రాను తుది జట్టులోకి తీసుకుంది. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో మిశ్రాకు చోటు కల్పించారు.
తుది జట్లు
చెన్నై: ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్
ఢిల్లీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, శిఖర్ ధావన్, కొలిన్ ఇన్గ్రామ్, రిషభ్ పంత్, కీమో పాల్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాతియా, అమిత్ మిశ్రా, రబడా, ఇషాంత్ శర్మ
మరిన్ని వార్తలు