సైక్లిస్ట్ దెబోరా సంచలనం
ఒకే ఈవెంట్లో ఐదు పతకాలు
న్యూఢిల్లీ: భారత సైక్లిస్ట్ దెబోరా.. తైవాన్ కప్ ట్రాక్ ఇంటర్నేషనల్ క్లాసిక్ ఈవెంట్లో సంచలన ప్రదర్శనతో చెలరేగింది. మహిళల ఎలైట్ విభాగంలో స్వర్ణం, మూడు రజతాలు, ఓ కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఐదు పతకాలు సాధిం చిన తొలి భారత సైక్లిస్ట్గా రికార్డులకెక్కింది. మహిళల ఎలైట్ స్ప్రిం ట్ ఫైనల్లో దెబోరా... మలేసియా టాప్ రైడర్ను ఓడించి తొలి స్వర్ణాన్ని సాధించింది. అయితే కైరిన్ విభాగంలో కూడా తృటిలో పసిడి చేజారింది. ఫొటో ఫినిష్ కాంటెస్ట్లో దెబోరా రెండో స్థానంతో సంతృప్తిపడింది. బ్యాంకాక్లో ఈనెల 11 నుంచి 9 వరకు జరిగే యూసీఐ క్లాస్-1 ఈవెంట్; నవంబర్ 18 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగే ట్రాక్ ఆసియా కప్తో పాటు వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో దెబోరా బరిలోకి దిగనుంది.