కోహ్లి అండ్ గ్యాంగ్కు గేల్ విందు
జమైకా: వెస్టిండీస్ లో భారత క్రికెట్ జట్టు పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ తో భారత్ తన విండీస్ పర్యటనను ముగించింది. అయితే భారత క్రికెటర్లకు ఆ దేశ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ చక్కటి విందును ఏర్పాటు చేశాడు. గేల్ది కూడా జమైకా కావడంతో మ్యాచ్ ముగింసిన తరువాత కోహ్లి అండ్ గ్యాంగ్ ను గేల్ తన ఇంటికి ఆహ్వానించాడు. దీనిలో భాగంగా గేల్ విందును ఏర్పాటు చేశాడు.
ఈ విషయాన్ని భారత ఓపెనర్ అజింక్యా రహానే ట్విట్టర్ లో తెలిపాడు. ఇక్కడ గేల్, భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్లతో కూడిన ఫోటోను పోస్ట్ చేసి విందు విషయాన్ని వెల్లడించాడు. డిన్నర్ కు ఆహ్వానించిన గేల్ కు ధన్యవాదాలు అంటూ రహానే ఫోటో కింద పేర్కొన్నాడు. వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలో మరొ విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో సైతం భారత క్రికెటర్లకు విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు