ఆ వార్తలు అవాస్తవం: బిగ్ బీ
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు అయన కుటుంబ సభ్యులకు క్రీడలపై ఉండే ఆసక్తిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీడలపై ఉన్న అభిమానంతో ఇప్పటికే ఇండియన్ సూపర్లీగ్ చెన్నయాన్ ఎఫ్సీ, ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్లకు బిగ్బీ కుటుంబ సభ్యులు వాటాదారులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ క్యాష్ రిచ్ లీగ్గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ లీగ్పై బిగ్ బీ ఆసక్తి కనబర్చిననట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపనట్లు.. సీఎస్కేను తీసుకునేందుకు యత్నించినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో ఐపీఎల్ క్రికెట్ లోకి అమితాబ్ కుటుంబం ప్రవేశించనున్నారనే వార్త అటు బిగ్ బీ, ఇటు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలను కొట్టిపారేశారు. ‘నేను గాని నా కుటుంబ సభ్యులు ఐపీఎల్లో ఏ జట్టును కొనుగోలు చేయలేదు.. అలాంటి ప్రయత్నాలు కూడా చేయటం లేదు. నేను, నా కొడుకు అభిషేక్ ఐపీఎల్ క్రికెట్ లీగ్లో సీఎస్కేను కొనుగోలుచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం’అని బిగ్ బీ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు