200కే బంగ్లా కుదేలట..!
ప్రపంచ కప్ నాకౌట్ దశలో భాగంగా గురువారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ 200 నుంచి 250 పరుగులు చేయొచ్చేమోనని క్రికెట్ అభిమానులు తెలిపారు. బంగ్లా ముందు భారత్ నిర్దేశించిన లక్ష్యం 303 పరుగులు కాగా 25 ఓవర్ల సమయానికి బంగ్లా స్కోరు 95/4గా ఉంది. దీంతో మిగితా ఓవర్లలో బంగ్లా ఎన్ని పరుగులు చేస్తుందని సాక్షి.. ఫేస్బుక్ ద్వారా క్రికెట్ అభిమానులను ప్రశ్నించగా ఎక్కువమంది 200కే ఆలౌట్ అని అన్నారు. ఇంకొందరు బంగ్లా 150 పరుగులు మాత్రమే చేయగలదని, 25 ఓవర్లకు 95 చేశారంటే మరో 25 ఓవర్లకు కూడా మరో 95 చేస్తారేమోగానీ అప్పటివరకు వికెట్లు పడిపోకుండా ఉండాలి కదా అంటూ తమ ప్రతిస్పందన తెలిపారు.