అందుకు హార్దిక్ పాండ్యానే కారణం: ధావన్
మెల్బోర్న్: తమ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కీలక ఆటగాడని అంటున్నాడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్. భారత జట్టు సమతుల్యత రావడంలో హార్దిక్ ముఖ్య భూమిక పోషించాడన్నాడు. ఇటీవల ఓ టీవీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లు సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో హార్దిక్ పాండ్యా గురించి ధావన్ మాట్లాడుతూ.. ’ పాండ్యా జట్టులోకి వచ్చిన తర్వాత సమతుల్యత ఏర్పడింది. భారత జట్టు బ్యాలెన్స్ కావడంలో పాండ్యా పాత్ర కీలకం. పాండ్యా జట్టులో చేరిన దగ్గర్నుంచీ మా జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు’ అని పేర్కొన్నాడు. మరొకవైపు పేసర్లు మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్లను వెనకేసుకొచ్చాడు ధావన్.
వారిద్దరూ ఇంకా యువ క్రికెటర్లేనని, వారు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారన్నాడు. రాబోవు కాలంలో ఆ ఇద్దరూ మరింత పరిణితి సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ బౌలింగ్ యూనిట్కు సంబంధించి ఎటువంటి ఆందోళన లేదన్నాడు.ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింన సంగతి తెలిసిందే. దాంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.
సంబంధిత వార్తలు