ఆదిలోనే టీమిండియాకు షాక్‌

Australia on top with Vijays wicket - Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. 12 బంతులను ఎదుర్కొన్న విజయ్‌.. స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ ఆఖరి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. దాంతో లంచ్‌ సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి ఆరు పరుగులు చేసింది.

అంతకుముందు ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన ఆతిథ్య జట్టు.. రెండో రోజు ఆటలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. 277/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆటను ప్రారంభించిన ఆసీస్‌..మరో 49 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది.  భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మ నాలుగు వికెట్లు సాధించగా, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, విహారిలు తలో రెండు వికెట్లు తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top