ధోని నమ్మకాన్ని నిలబెట్టా
రాయుడు వ్యాఖ్య
ఢిల్లీ: ఐపీఎల్లో ఓపెనింగ్కు పంపి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తనపై పెట్టుకున్న నమ్మ కాన్ని నిలబెట్టానని అంటున్నాడు టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు. ఆటపై దృష్టిపెట్టి... అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నానని తెలిపాడు. శారీరకంగా సంసిద్ధంగా ఉండేందుకే ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. ‘నాకిప్పుడు 33 ఏళ్లు. గతంలో మోకాలి గాయానికి శస్త్రచికిత్స జరిగింది. మరింత కాలం క్రికెట్లో కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని వివరించాడు.
రాబోయే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమేనని... అయితే ఇతర పద్ధతుల ద్వారా దానిని భర్తీ చేయొచ్చని పేర్కొన్నాడు. వన్డేల్లో నాలుగో నంబరు స్థానానికి రాయుడిని సరైన ప్రత్యా్నమాయంగా కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో ప్రకటించాడు. దీనిపై అతడు స్పందిస్తూ ‘ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సన్నాహాల్లో ఉన్నాను. ఏ స్థానంలో దిగాలనేదానిపై ఆలోచించను. ఆటపైనే దృష్టిపెట్టి మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉన్నా’ అని వివరించాడు.