రాయుడు హాఫ్‌ సెంచరీ.. శంకర్‌ మిస్‌

Ambati Rayudu Gets Half Century against New Zealand - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు హాఫ్‌ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో కెరీర్‌లో 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను రాయుడు.. క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌తో కలిసి ఆదుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టెక్కించారు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీకి చేరువైన విజయ్‌ శంకర్‌ లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి కేదార్‌ జాదవ్‌తో రాయుడు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top