శంషాబాద్లో అర్థరాత్రి కారు బీభత్సం
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో శుక్రవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు శంషాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ వద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం తాగి వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. ముగ్గురు యువకులు శంషాబాద్ మండలంలోని సుల్తాన్ పల్లి వాసులుగా గుర్తించారు.