తాగునీటి వసతి కల్పించండయ్యా!
నెల్లూరు(సెంట్రల్): ‘అయ్యా.. మాది వింజమూరు. మూడేళ్లుగా సరిగా వర్షాలు పడకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది’ అని వింజమూరుకు చెందిన పల్లాల పెదకొండారెడ్డి మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశాడు. వర్షాలు పడకపోవడంతో తాగు, సాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయాడు. పలుమార్లు అధికారులకు, పాలకులకు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని పేర్కొన్నాడు. స్పందించిన జననేత వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు.