పింఛన్ ఇప్పించడయ్యా!
కొండాపురం: ‘అన్నా.. నాకు 11వ సంవత్సరంలో కుడి కాలికి పోలియో సోకింది. దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం పలుమార్లు నెల్లూరు సదరన్ క్యాంప్లకు వెళ్లా. సర్టిఫికెట్ ఇవ్వలేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు’ అని కలిగిరి మండలం వీరారెడ్డిపాళేనికి చెందిన ఎన్.కృష్ణవేణి మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకుంది. స్పంచిందిన జననేత వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.