డాక్యుమెంట్ రైటర్లకు న్యాయం చేయండన్నా!
నెల్లూరు(సెంట్రల్): టీడీపీ ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్లను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తోందని కావలి ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్ రైటర్లు నాగరాజు, కుమార్, సాయిప్రసాద్, గౌస్బాషా తదితరులు మనుబోలుపాడు వద్ద శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. జిల్లాలో అనేకమంది ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గతంలో తమకు లైసెన్స్లు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం లైసెన్స్లను రెన్యువల్ చేయకుండా ఆన్లైన్ విధానం అంటూ తమ కడుపులు కొడుతోందని వాపోయారు. మన అందరి ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని జననేత వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు.