దివ్యాంగులకు న్యాయం చేయాలన్నా!
సోమశిల: దివ్యాంగుల పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దయనీయంగా ఉందని, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు చీర్ల బాబు ప్రజాసంకల్పయాత్రలో బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. ఇతరులకు రిజర్వేషన్లు, చట్టాలు చేసినా దివ్యాంగులకు మాత్రం న్యాయం జరగడం లేదని, మీరైనా న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగులపై చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షుడు తిరుమలపూడి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.