‘కార్పొరేట్’తో ఇబ్బందులు పడుతున్నామయ్యా!
నెల్లూరు(సెంట్రల్): ‘అయ్యా.. మేము ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లం, మేము అనేక ఏళ్ల నుంచి వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలను నెలకొల్పి పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నామని, కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు అనేక రకాలుగా ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ మమ్ములను ఇబ్బందులలో పడేస్తున్నారు’ అని ఆ సంఘ నాయకులు వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రమణారెడ్డి, దొరస్వామిరెడ్డి తదితరులు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. పేద పిల్లలకు నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ మెరుగైన విద్యను అందిస్తూ ఎప్పటి నుంచో తాము ఉన్నామని, అధికార పార్టీ అండతో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు తమ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కుట్ర చేస్తున్నారని వాపోయారు. మన ప్రభుత్వం వస్తే విద్యావ్యవస్థలో పూర్తిగా మార్పు తీసుకొచ్చి అందరికీ న్యాయం చేస్తామని జననేత వైఎస్ జగన్ వారికి భరోసా కల్పించారు.