ఉపాధి పనులకు డబ్బులు ఇవ్వడం లేదయ్యా!
నెల్లూరు(సెంట్రల్): ‘అయ్యా..పూటగడవడం కోసం ఉపాధి పనులకు వెళితే కూలి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని నీలాయపాళేనికి చెందిన మస్తాన్బీ, హుస్సేన్బీలు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. డబ్బులు ఇవ్వమని అడిగితే పనులు ఇవ్వకుండా కక్ష సాధింపు గురిచేస్తున్నారంటూ వాపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు అన్ని విధాలా సాయం చేస్తామని వారికి జననేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.