న్యాయం చేయాలన్నా
నెల్లూరు(సెంట్రల్): ‘అన్నా.. మేం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఏటా కరువు కోరల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నాం. కరువు భత్యం అందించి మమ్మల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు’ అంటూ హసనాపురానికి చెందిన పెంచలమ్మ, నాగమణి,లక్ష్మమ్మ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కూలికి పోతే వచ్చే రూ.100, 150తో పూట గడవడం కూడా కష్టమైపోతోందన్నారు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు.