ప్రారంభమైన 90వ రోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర 90వ రోజు ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం బంగారక్కపాలెం క్రాస్ నుంచి పాదయాత్రను ఆరంభించారు. అక్కడ నుంచి గాంధీనగర్ చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోళ్లపాడు క్రాస్, కునిపాలెం క్రాస్, పోకూరు గ్రామాల్లో ప్రజలతో ఆయన మమేకం అవుతారు. వలేటివారిపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. వైఎస్ జగన్ ఇప్పటివరకూ 1,207 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు.