టైం, ప్లేస్ చెప్తే చర్చకు వస్తా: అంబటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివ ప్రసాద రావుపై వైఎస్సాసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించే అర్హత, స్థాయి కోడెలకు లేదని వ్యాక్యానించారు. అవినీతిపై చర్చకు రావాలన్న కోడెల్ సవాల్ని స్వీకరిస్తున్నట్లు పత్రికాముఖంగా తెలిపారు. టైం, ప్లేస్ చెప్తే చర్చకు వస్తానని రాంబాబు వెల్లడించారు.
దుర్మార్గపు రాజకీయ చరిత్ర కలిగిన కోడెల స్పీకర్ పదవికి అనర్హుడని దుయ్యబట్టారు. ఓట్ల తొలగింపు కోసమే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పేరు మీద అప్లికేషన్లు పెట్టారని ఆరోపించారు. ఓట్ల విచారణ పేరుతో మా వాళ్లని పోలీసు స్టేషన్కి పిలిపించారని విమర్శించారు. మా కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఓట్ల తొలగింపునకు అప్లికేషన్లు పెట్టలేదని వెల్లడించారు.