ప్రధాని ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ నిరసన

YSRCP protests on Prime Minister's speech - Sakshi

 ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై సవరణలు ప్రతిపాదించిన ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సాయానికి గాను ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఐదు సవరణలు ప్రతిపాదించారు.

ఏపీకి ప్రత్యేక హోదా.. విశాఖలో రైల్వే జోన్, కడపలో స్టీల్‌ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు, పోలవరానికి పూర్తి ఖర్చు భరింపు, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ, రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లను విస్మరించడంపై విజయసాయిరెడ్డి సవరణలు ప్రతిపాదించి డివిజన్‌ కోరగా.. అవి వీగిపోయాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top