‘ఆయన కళ్లకు అందరూ అలానే కనిపిస్తారేమో..!’
సాక్షి, హైదరాబాద్ : తన అవకాశవాదానికి అనుగుణంగా అవతలి వాళ్లపైన బురద జల్లడం చంద్రబాబుకు బాగా అలవాటంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సారి మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపై మండిపడుతూ ఆయన ట్విట్టర్లో స్పందించారు. ‘బాబు బీజేపీతో కాపురం చేసినప్పుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది పిల్ల కాంగ్రెస్ అని.. వైఎస్సార్సీపీది కూడా అదే డీఎన్ఏనే అన్నారు. ఇదే బాబు ఇప్పుడు కాంగ్రెస్తో దోస్తీ చేస్తూ వైఎస్సాఆర్సీపీ బీజేపీతో కుమ్మక్కయిందంటున్నారు. తన అవకాశవాదానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు అవతలి వాళ్లపైన బురద జల్లుతారు. పొలిటికల్ బ్రోకర్ కళ్లకు అందరూ అలానే కనిపిస్తారేమో’ అంటూ ట్వీట్ చేశారు.