‘ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబు తలపండినవారు ’

YSRCP MP Vijayasai Reddy Criticises Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల అదృష్టం బాగుండి చంద్రబాబు అధికారంలో లేరు గానీ, ఒక వేళ అధికారంలోకి వచ్చి ఉంటే  ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేవారందరికీ తానే సంధానకర్తను అని చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. ఆయన ఇన్ సైడర్ ట్రేడింగ్ లో తలపండినవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతిలో ‘గాయపడిన’ వారందరినీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించేవారని వ్యాఖ్యానించారు.

80 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉత్పత్తులను వాల్‌మార్ట్, ఐటీసీ, మహీంద్రా, ఫ్యూచర్‌ గ్రుప్‌ వంటి కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేస్తాయని చంద్రబాబు గతంలో చెప్పారని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఈ కంపెనీలు కొనుగోలు చేస్తున్న వస్తువులేమిటో చంద్రబాబు, ఆయన అనుచరులు సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top