‘దుర్మార్గాలను కప్పిపెట్టుకోవడానికే పొత్తు’

YSRCP MP Vijaya Sai Reddy Comments On TDP And Congress Alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేసిన అన్యాయాలను, దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికే ​టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుంటున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు మంచి ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందా  ఆయన ట్విటర్‌ వేదికగా​ ప్రశ్నించారు. ‘ కాంగ్రెస్‌, టీడీపీ ఎన్నికల పొత్తా? దీన్ని కలికాలం అనాలా లేక పోయేకాలం అనాలా? వారిద్దరూ ఏపీ ప్రజలకు చేసిన అన్యాయాలను, దుర్మార్గాలను కప్పిపెట్టుకోవడానికే ఈ ఎత్తు వేశారు. పరమ దుర్మార్గమైన ఇద్దరి కలయిక వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? ’ అని ట్విటర్‌లో విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top