‘దొడ్డిదారిన దోచిపెట్టేందుకే చంద్రన్న మాల్స్’
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన చంద్రన్న మాల్స్పై వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు తమదైన రీతిలో స్పందించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. ఈ రోజు మీడియాతో నేతలిద్దరూ మాట్లాడుతూ.. చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు.
రిలయన్స్, హెరిటేజ్లకు మేలు చేసేందుకు ప్రస్తుతం తెరపైకి చంద్రన్న మాల్స్ను తెచ్చారని వారు పేర్కొన్నారు. గతంలో రేషన్ షాపుల్లో తక్కువ ధరలకే సరుకులు వచ్చేవని.. ఇప్పుడు అధిక ధరలకు సరుకులను విక్రయిస్తున్నారని నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. కొంతమందికి దొడ్డిదారిన దోచిపెట్టేందుకే చంద్రన్న మాల్స్ అని నేతలు ఎద్దేవా చేశారు.
చంద్రన్న చౌకదుకాణాలు కాదు.. చౌకబారు ఎత్తుడగల దుకాణాలు అని వారు విమర్శించారు. ప్రభుత్వం చంద్రన్న మాల్స్తో చిరువ్యాపారుల పొట్ట కొడుతుందన్నారు. అంతేకాక రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్, హెరిటేజ్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం చంద్రన్న మాల్స్ను తెరపైకి తెచ్చిందని నేతలు విమర్శించారు. చంద్రన్న మాల్స్ వెనుక చంద్రబాబు స్వార్థం, వ్యాపార వ్యూహాలు, రాజకీయ కుట్రలు దాగుతున్నాయని నేతలు పేర్కొన్నారు.