‘టీడీపీలో నీపై నమ్మకం సన్నగిల్లింది’

YSRCP Leader Srikanth Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోకల్‌ బాడీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదనే భయాందోళనతో టీడీపీ నేతలు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ముసలం మొదలైందని, ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారని తెలిపారు. టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని విమర్శించారు. డీజీపీ ఠాకూర్‌పై వైఎస్సార్ సీపీ అనేక ఫిర్యాదులు చేసినా బదిలీ చేయలేదన్నారు.

చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారని, ఎన్నికలకు ముందు ఈవీఎంలు వద్దని, టీడీపీ ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసునన్నారు. బాబు అధికారంలో ఉండి చెయ్యరాని పనులు చేశారని ఆరోపించారు. ఆయన విడుదల చేసిన ఆడియో.. గ్యాంబ్లింగ్‌ ప్రోత్సహించేలా ఉందన్నారు. సీఎం హోదాలో ఉండి సట్టా మార్కెట్‌, మట్కాలపై ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top