‘చంద్రబాబు మతిభ్రమించిన నాయకుడిలా’..

YSRCP Leader Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మతిభ్రమించిన నాయకుడిలా దేశమంతా తిరుగుతున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపాలా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చిందన్నారు. తాము ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేశామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేశారన్నారు. చంద్రబాబు, టీడీపీ పీడ విరగడ కావాలని ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. పోలింగ్ రోజు హడావుడి చేశారని, రేపు కౌంటింగ్ రోజు కూడా హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

ఢిల్లీలో చక్రం తిప్పుతానని.. బాబే చక్రంలా తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రేపు వైఎస్సార్‌ సీపీ విజయభేరీ మోగించడం ఖాయమన్నారు. లగడపాటి సెఫాలజిస్ట్ కాదని, ఆయన సర్వేలకు విశ్వసనీయత లేదన్నారు. ఆయన వేరే ప్రయోజనాల కోసం అలా చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నాడి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, మంచి మెజారిటీతో తాము గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈవీఎంలపై రకరకాలుగా మాట్లాడుతున్నారని, కౌంటింగ్ చివరివరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top