ఫెడరల్‌ ఫ్రంట్‌ ముఖ్య ఉద్దేశం అదే : మార్గాని భరత్‌

YSRCP Leader Margani Bharath Fires On TDP Leaders - Sakshi

పశ్చిమగోదావరి : పదవుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ను కలిసినప్పుడు ఏం మాట్లాడనివారు.. ​ఇప్పుడు కేటీఆర్‌, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిస్తే మాత్రం ఎందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారంటూ వైఎస్సాఆర్‌ సీపీ నాయకులు మార్గాని భరత్‌ ప్రశ్నించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ - కేటీఆర్‌ కలయిక గురించి తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమిని స్వాగతించాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపించారు. ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరుగుతుంటే.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కలిసి పోరాటం చేయడమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగానే కేటీఆర్‌, జగన్‌ను కలిశారన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top