‘నీ నిజస్వరూపం బయటపెడతా’..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారని వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను చంద్రబాబు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడితే నోటీసులు ఇస్తావా అని ప్రశ్నించారు. 6వ తేదీన గుంటూరు అరండల్ పేట పోలీస్టేషన్కి వచ్చి చంద్రబాబు నిజస్వరూపం బయట పెడతానన్నారు. తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కేశినేని నాని, రాజేంద్రప్రసాద్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కారు కూతలు కూసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు దేశాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, తెలుదేశం పార్టీని కాపాడుకోవడానికే చేరారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని! వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను ఖూనీ చేసిన.. ఖూనీ కోరు పార్టీగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు చీకట్లో చిదంబరం కాళ్లు, సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నాడని తాము ఎప్పుడో చెప్పామన్నారు