‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’
సాక్షి, విజయనగరం: నాలుగేళ్లలో అన్ని రంగాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారయణ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రైతులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
దోపిడీలు, చోరీలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసేందేకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పూనుకున్నారు. ఆయన చేస్తున్న యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారని పేర్కొన్నారు.