వైఎస్ షర్మిల రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రేపటి (ఆదివారం) ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. తూర్పు గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో (రాజోలు, కాకినాడ సిటీ, రామచంద్రాపురం) వైఎస్ షర్మిల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
ఉదయం 11గంటలకు రాజోలు నియోజకవర్గంలోని మల్కిపురంలో, మధ్యాహ్నం 3:20 గంటలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలోని ఆనంద భారతి గ్రౌండ్లో, సాయంత్రం 5:30 గంటలకు రామచంద్రాపురం నియోజకవర్గంలోని కోటిపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.