257వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, పెందుర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 257వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం జననేత పెందుర్తి నియోజకవర్గంలోని నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జెర్రిపోతుల పాలెం, పెదనరవ మీదుగా కోటనరవ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోజన విరామం తీసుకుంటారు.
తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అనంతరం కొత్తపాలెం మీదుగా గోపాలపట్నం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
సంబంధిత వార్తలు