256వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, పెందుర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 256వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం జననేత నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అమృతాపురం, ఇప్పవానిపాలెం మీదగా జెర్రిపోతులపాలెం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్ జగన్ 255వ రోజు పాదయాత్ర బుధవారం చిన్నగొల్లలపాలెం క్రాస్ వద్ద ముగిసింది. నేడు రావులమ్మ పాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం మీదుగా సబ్బవరం, చిన్న గొల్లలపాలెం వరకు 10.2 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు వైఎస్ జగన్ 2904.3 కిలోమీటర్లు నడిచారు.