250వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagans Praja Sankalpa Yatra 250th Day Schedule - Sakshi

సాక్షి, అనకాపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 250వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం జననేత అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మర్టూరు క్రాస్‌, బవులువాడ‌, త్రిమూర్తులు నగర్‌ మీదుగా దర్జీనగర్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌ 249వ రోజు పాదయాత్ర బుధవారం అనకాపల్లి వద్ద ముగిసింది. నేడు మునగపాక నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర గంగాదేవి పేట క్రాస్‌, ఒంపోలు, నాగులపల్లి, తుమ్మపాల మీదుగా అనకాపల్లి వరకు 10.8 కిలోమీటర్లు సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2,842.8 కిలోమీటర్లు నడిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top