ప్రజాసంకల్పయాత్ర 82వ రోజు షెడ్యూల్
సాక్షి, నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 82వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు. బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఆత్మకూర్ నియోజకవర్గం సంగం బైపాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలిగిరి క్రాస్ రోడ్డు, తలుకురుపాడు క్రాస్ రోడ్డు మీదుగా కొరిమెర్ల క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. హసనాపురం ఎంట్రెన్స్ చేరుకున్న తర్వాత వైఎస్ జగన్ అక్కడ మైనార్టీలతో సమావేశమవుతారు. అనంతరం హసనాపురం మీదుగా దుండిగామ్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి అక్కడే బసచేస్తారు.
ముగిసిన 81వ రోజు పాదయాత్ర
వైఎస్ జగన్ 81వ రోజు పాదయాత్రను సంగం శివారులో ముగించారు. మంగళవారం ఉదయం అన్నారెడ్డి పాలెం క్రాస్ రోడ్డు వద్ద ప్రారంభమైన జననేత పాదయాత్రకు అధిక సంఖ్యలో ప్రజలు సంఘీభావం పలికారు. ఈ రోజు వైఎస్ జగన్ 14.6 కిలోమీటర్లు నడిచారు.