85వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 85వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం అనంతాపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. సిద్దన కొండూరు, సిద్దన కొండూరు హరిజనవాడ, అయ్యపు రెడ్డి పాలెం మీదుగా పెద్ద కొండూరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. జననేతకు ప్రజలు పెద్ద ఎత్తునా స్వాగతం పలుకుతున్నారు.