165వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం

YS Jagan Prajasankalpayatra 165th Day Begins - Sakshi

సాక్షి, గోపాలపురం : ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్పయాత్రలో ముందుకు సాగుతున్నారు. శుక్రవారం ఉదయం వైఎస్‌ జగన్‌  పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని పావులూరివారి గూడెం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి రాజుపాలెం, మారం పల్లి, ఘంటావారి గూడెం మీదుగా దూబచెర్ల చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి పుల్లలపాడు క్రాస్‌, నల్లజెర్ల చేరుకుంటారు. నల్లజర్లలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top