164వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం

YS Jagan Prajasankalpayatra 164th Day Begins - Sakshi

సాక్షి, గోపాలపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరిలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం వైఎస్‌ జగన్‌ పెరుగు గూడెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం, సూర్యచంద్రరావుపేట మీదుగా గొల్లగూడెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అనంతరం తిరుమలపాలెం మీదుగా పాములూరు గూడెం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌  2,036 కిలోమీటర్లు నడిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top