140వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, నూజివీడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శోభనాపురం శివారు నుంచి గురువారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ఈదర మీదుగా కొత్త ఈదర గ్రామం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతతో కలిసి అడుగులేస్తున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు.
ముగిసిన ప్రజాసంకల్పాయాత్ర
వైఎస్ జగన్ 139వ రోజు పాదయాత్రను శోభానాపురం వద్ద ముగించారు. అడగడుగునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నేడు జననేత 15.2కిలోమీటర్లను నడిచారు. ఇప్పటి వరకు జననేత 1756.6 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.