254వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Praja Sankalpa Yatra 254th Day Schedule Released - Sakshi

సాక్షి, కె.కోటపాడు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 254వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జననేత జోగన్నపాలెం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె.సంతపాలెం చంద్రయ్యపేట, అయ్యన్నపాలెం మీదుగా బుదిరెడ్డిపాలెం క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌ 253వ రోజు పాదయాత్ర సోమవారం కె.కోటపాడు వద్ద ముగిసింది. నేడు మొల్కలాపల్లి శివారు నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర కొత్తపెంట, ఎ.భీమవరం, పడుగుపాలెం మీదుగా ఎ.కోడూరు. కె.కోటపాడు వరకు 12.2 కిలోమీటర్లు సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2,883.6 కిలోమీటర్లు నడిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top