252వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, చోడవరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 252వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జననేత చోడవరం నియోజకవర్గంలోని నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చోడవరం, రేవల్లు, కందిపల్లి క్రాస్, లక్కవరం క్రాస్, గవరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భోజన విరామం తీసుకుంటారు.
తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అనంతరం జి.జగన్నాథపురం మీదుగా వేచారం క్రాస్ వద్ద మాడుగుల నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. ములకలపల్లి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్ జగన్ 251వ రోజు పాదయాత్ర శనివారం చోడవరంలో ముగిసింది. నేడు వైఎస్ జగన్ 12 కిలోమీటర్లు నడిచారు. ఈ రోజు పాదయాత్ర వుడేరు శివారు, మామిడిపాలెం, గంధవరం, దొడ్డుపాలెం, ముందుర్తి, వెంకన్నపాలెం, అంబెరుపురం, గోవాడ, జగపతినగరం, అన్నవరం మీదుగా చోడవరం వరకు కొనసాగింది. ఇప్పటివరకు ఆయన 2859.6కిల్లోమీటర్లు నడిచారు.