251వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, అనకాపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 251వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం జననేత అనకాపల్లి నియోజకవర్గంలోని నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మామిడి పాలెం క్రాస్, గంధవరం, దొడ్డు పాలెం క్రాస్, వెంకన్న పాలెం, గోవాడ మీదుగా అంబేరు పురం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది.
అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాదయాత్ర చోడవరం నియోజకవర్గంలోని గణపతి నగరం మీదుగా చోడవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.