12వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్ విడుదలైంది. బనగాలపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం సౌందరదిన్నె నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్ రోడ్డు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు బనగాలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్ రోడ్కు చేరుకొని.. అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 11.30 గంటలకు ఎల్లురి కొత్తపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు వైఎస్ జగన్ భోజనం విరామం తీసుకుంటారు.
తిరిగి ఎల్లురి కొత్తపేట శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటలకు బనగాలపల్లి చేరుకొని.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు.