102వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Ys Jagan Mohan Reddy Prajasankalpayatra 102 Day Schedule Released - Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈమేరకు వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. శనివారం ఉదయం చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం శివారు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దర్శి మండలంలోకి ప్రవేశిస్తారు. శివరాం పురం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.

10 గంటలకు విరామం​ తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు వైఎస్‌ జగన్‌ తిరిగి పాదయాత్ర  ప్రారంభిస్తారు. కొర్రపాటి వారి పాలెం క్రాస్‌ మీదుగా తాళ్లూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆతరువాత సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్రను ముగించి రాత్రికి అక్కడే బస చేస్తారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 101 రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. నేడు 15.9 కిలోమీటర్లు నడిచిన జననేత మొత్తం 1370.8 కిలోమీటర్లు నడిచారు.  చీమలమర్రి, మంచికలపాడు, బండ్లముడి, తొర్రగుడిపాడు క్రాస్‌, పల్లామిల్లి మీదుగా గాడిపర్తివారిపాలెం వరకూ పాదయాత్ర సాగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top