పార్టీ సీనియర్లతో వైఎస్‌ జగన్‌ సమావేశం

ys jagan mohan reddy meets party senior leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలు, పాదయాత్రతో పాటు వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా వైఎస్‌ జగన్‌ వచ్చే నెల 2వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top